పశ్చిమ గోదావరి : వెంకటరాజుపురం గ్రామంలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరాపల్లి మండలం వెంకటరాజుపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఈ రోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళుతుండగా, విశాఖ డైరీ కి చెందిన లారీ నెంబర్ ఎపి 31 టియు 4734 వాహనం వృద్ధురాలిని ఢీకొన్న వెళ్లిపోయింది. ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి చేరుకొన్న దేవరాపల్లి పోలీసులు వివరాలు సేకరించారు. మరణించిన వృద్ధురాలు వెంకటరాజుపురం గ్రామానికి చెందిన లెక్కల మంగమ్మ (65) గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు