తెల్ల రేషన్కార్డు అనేది అనేక సంక్షేమ పథకాలకు ప్రామాణికం. తెల్ల రేషన్కార్డు కలిగిన వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటాయి. రేషన్ పంపిణీ దగ్గర నుంచి సంక్షేమ పథకాల్లో సబ్సిడీ వరకూ ఈ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ క్రమంలోనే తెల్ల రేషన్ కార్డుదారులకు రూడ్ సెట్ సంస్థ శుభవార్త చెప్పింది.వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనుంది. ఈ మేరకు రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్లు తెలియజేశారు.
అనంతపురంలోని రూడ్ సెట్ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ట్రైనింగ్ కోసం..ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలని తెలిపారు. అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలని వివరించారు. ఇక శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు.
ఇదే విధంగా ఒంగోలు జిల్లా వాసులకు కూడా రూడ్ సెట్ సంస్థ స్వయం ఉపాధి శిక్షణ అవకాశాన్ని కల్పిస్తోంది. ఒంగోలులోని రూడ్ సెట్ సంస్థలో మే 22వ తేదీ నుంచి ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. 19 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల లోపు యువకులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువకులు ఈ ట్రైనింగ్కు అర్హులని వెల్లడించారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆసక్తి ఉన్న యువత ఒంగోలులోని రూడ్ సెట్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.
మరోవైపు రూరల్ ఎంప్లాయిమెంట్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్అనే స్వచ్ఛంద సంస్థను 1982లో స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో.. వారికి వివిధ కోర్సుల్లో శిక్షణ అందిస్తూ ఉంటుందీ సంస్థ. పలు జిల్లాలలోనూ రూడ్ సెట్ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. ఈ కార్యాలయాల ద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ సహా వివిధ అంశాలపై ట్రైనింగ్ ఇస్తుంటారు.