దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో సీఎం వైయస్ జగన్ నూతన ట్రెండ్ను తీసుకొచ్చారని, వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లు ఈ ఐదేళ్లలో మేలు జరిగితేనే ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన నాయకుడు సీఎం వైయస్ జగన్ అని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంస్కరణలు అన్నీ కొనసాగిస్తామని చెప్పామని, తాము చేపట్టినవి విప్లవాత్మకమైన సంస్కరణలు. వాటన్నిటినీ కొనసాగిస్తామని చెప్పామన్నారు. వీటన్నిటినీ చూసి మాకు ఓటేయండి అని అడిగిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. వైయస్ జగన్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా అన్నీ స్పష్టంగా చెప్పారని, అందుకే ప్రజలు కూడా ఉవ్వెత్తున పోలింగ్ బూత్లకు బారులు తీరారన్నారు. వృద్ధులు, మహిళలు, దివ్యంగులు, ప్రజలు అందరూ వైయస్ జగన్ని ఆశీర్వదించారని చెప్పారు.