విశాఖ పరిధిలోని గంగవరం పోర్ట్ కార్మికుల ఉద్యమం కొలిక్కి వచ్చింది. శుక్రవారం నుంచి విధుల్లోకి చేరారు. రేపటి నుంచి ప్రోడక్షన్ దిశగా విశాఖ ఉక్కు కర్మాగారం పని చేయనుంది. ఒన్ టైమ్ సెటిల్మెంట్ దిశగా గంగవరం పోర్ట్ కార్మికులు అడుగులు వేస్తున్నారు. గత 41 రోజులు, ఇప్పుడు 20 రోజులుగా చేస్తున్న ఉద్యమనికి ఉద్యోగులు స్వస్తి పలికారు. విశాఖ ఉక్కు ఊపిరి పీల్చుకుంది... గంగవరం పోర్టు మీద ఆధారపడిన స్టీల్ ఫ్లాంట్ ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా వరకు ఉత్పత్తి నిలిపివేసింది. ఇప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. కోకింగ్ కోల్ బ్యాటరీస్ను నార్మల్ టెంపరేచర్తో మెంటైన్ చేస్తున్నారు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే పరిశ్రమ మూతపడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదముంది. ఇటువంటి పరిస్థితిలో గంగవరం కార్మికులు సమ్మె విరమించడంతో ఒక వైపు వారికి లాభమైతే.. మరోవైపు స్టీల్ ప్లాంట్కు ప్రయోజనం చేకూరనుంది. ఉత్పత్తికి కావాల్సిన సుమారు 60 వేల టన్నుల కోకింగ్ కోల్ను ప్రస్తుతం అదానీ పోర్టులో ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్కు తరలిస్తున్నారు. కార్మికులు మొదట్లో పెట్టిన డిమాండ్లను తగ్గించుకుని ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కోసమే విధులకు హాజరవుతున్నామని కార్మికులు తెలిపారు.