రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు జయప్రదం చేయాలని ఆలయ ఈవో నరసింహారెడ్డి శుక్రవారం మీడియాకి తెలిపారు. ఈనెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు బ్రహ్మోత్సవ వేడుకలు కొనసాగుతాయన్నారు. ప్రధానంగా 25న కళ్యాణ ఉత్సవం, 27న బ్రహ్మరథోత్సవ వేడుకలు కన్నుల పండుగలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పుర ప్రజలు, సర్వభక్తాదులు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలన్నారు.