ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మూడు జిల్లాలకు రైల్వేశాఖ శుభవార్త.. ఆ రైలు ఆ స్టేషన్‌లో కూడా ఆగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 03, 2024, 04:26 PM

ఉత్తరాంధ్రవాసులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ -పలాస- విశాఖ (08532/08531) ప్రత్యేక పాసింజర్‌ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించినట్లు వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు. విశాఖ -బ్రహ్మపుర (08532) పాసింజర్‌ రైలు ఈనెల 3 నుంచి ప్రతి రోజు సాయంత్రం 5.45గంటలకు విశాఖ నుంచి బయలుదేరి రాత్రి 11.10గంటలకు బ్రహ్మపుర చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో బ్రహ్మపుర- విశాఖ (08531) పాసింజర్‌ ఈనెల 4వ తేదీ నుంచి ప్రతిరోజు తెల్లవారుజామున 3.30గంటలకు బ్రహ్మపురలో బయలుదేరి ఉదయం 9.20గంటలకు విశాఖ చేరుకుంటుందన్నారు. ఈ రైలు 14 జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు, 2 సెకండ్‌ క్లాస్‌ దివ్యాంగజన్‌ బోగీలతో నడుస్తుందన్నారు.


ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి విశాఖ వెళ్లి వచ్చేందుకు వీలుగా పాసింజర్‌ రైలు లేకపోవడంతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. అలాగే కిడ్నీ బాధితులు వేకువజామున బస్సుల్లో వెళ్లేందుకు ఆర్థికంగా భారంగా మారింది. అందుకే పలాస పాసింజర్‌ రైలును ఈ నెల 3 నుంచి బ్రహ్మపుర వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్యాసింజర్ రైలును బ్రహ్మపుర వరకు పొడిగించేందుకు తనవంతుగా కృషిచేసిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో పాటుగా రైల్వే అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com