తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరిననాటినుంచి ఆమె మరణించేంత వరకూ ఆసుపత్రి బిల్లు మొత్తం 6.85 కోట్లు అయింది. ఇందులో కేవలం తిండికే 1.17 కోట్ల రూపాయిలు ఖర్చయింది. జయలలిత మొత్తం 75 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. 2016 డిసెంబర్5న జయలలిత మృతి చెందారు. అధికార ఎఐఎడిఎంకె 6 కోట్ల రూపాయిలు చెల్లించింది. తరువాత 41.13 లక్షల రూపాయిలు 2016 అక్టోబర్ 13న చెల్లించినట్లు ఆసుపత్రిపేర్కొంది. అయితే ఈ మొత్తం ఎవరు చెల్లించారనే విషయం వెల్లడికాలేదు.