శ్రీకాకుళం : పలాస మండలం ఎంఆర్ఒ కార్యాలయం వద్ద డిటి పాపారావుకు యువివి వారు శనివారం వినతిపత్రాన్ని అందచేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొన్న తిత్లీ రైతు బాధితులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ వినతిపత్రం అందచేశారు. ఇదే నేపథ్యంలో.. ఉద్ధానం రైతులకు దుప్పట్ల పంపిణీ సాయానికి గుంటూరుకు పంపిన ప్రజామండలి బృందాన్ని పోలీసులు అడ్డగించి వాటిని ఉద్ధానానికి చేరకుండా ఆపారు. పోలీసులు స్పందించి తమ బృందం సేకరించిన దుప్పట్లను విడుదల చేస్తే బాధితులకు అందిస్తామని కోరుతూ ప్రజామండలి సభ్యులు వినతిపత్రాన్ని అందచేశారు.