అమరావతి (అసెంబ్లీ): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి విధానాలపై ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల వ్యవహారంలో తన సోదరుడు కెఇ ప్రభాకర్కు అవకాశం రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడికి నచ్చచెప్పలేక తాను అనేక నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు వ్యాఖ్యానిరచారు. శాసనసభలోని తన ఛారబర్లో మంగళవారం ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రభాకర్కు టికెట్ అరశాన్ని ప్రస్తావిరచారు. రాయలసీమలోని ఒకే కుటుంబానికి మూడు పదవులు ఇచ్చారని, తన కుటుంబానికి వచ్చే సరికి వేరే విధానాలు అవలంబిస్తున్నారని తెలిపారు. తెలంగాణలోని మిషన్ భగీరథ తరహాలో రాష్ట్రరలో కూడా ఒక వాటర్ బోర్డును ఏర్పాటు చేసి, దానికి చైర్మన్గా తన సోదరుణ్ణి నియమిస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు వెల్లడించారు. దీనిపై తన తమ్ముడికి నచ్చచెప్పలేకపోతున్నానని ఆవేదన చెందారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ తనకు ఇదే సమస్య వస్తోరదన్నారు. కర్నూలు జిల్లా రాజకీయ ప్రాబల్యం, ప్రధానంగా గతం నురచి తమ కుటుంబానికి ఉన్న ప్రాధాన్యతను, 1953 నురచి రాష్ట్ర మంత్రివర్గంలో ఆ ప్రారతానికి ఉన్న ప్రాముఖ్యతను కూడా ఆయన వివరిరచారు.