చెన్నై: కరుణానిధి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్కు తరలించారు. పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వేలాదిమంది ప్రజలు కరుణానిధి పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. కరుణ పార్థీవదేహన్ని జాతీయ జెండాతో కప్పిఉంచారు. కేంద్రం నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, తంబిదురై, రజనీకాంత్.. కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, అభిమానులు శోకసంద్రంలో మునిగారు. ప్రధాని మోదీ, రాహుల్గాంధీ కరుణానిధికి నివాళులర్పించనున్నారు. కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్నారు. కాగా కరుణానిధి అంత్యక్రియ స్థలం వివాదంపై మద్రాస్ హైకోర్టు కాసేపట్లో విచారణ చేపట్టనుంది.