కోరమాండల్ ఎక్స్ప్రెస్కు శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని బహనాగా స్టేషన్ సమీపంలోని పనపనా వద్ద శుక్రవారం సాయంత్రం హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొనడంతో సుమారు 50 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే ఉద్యోగులు, భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.భద్రక్ నుండి కనీసం 5 అంబులెన్స్లు మరియు రెండు అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన రోగులకు చికిత్స అందించేందుకు బాలాసోర్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్యులను కూడా పంపించారు.