ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీం ఇండియా అంటే వాళ్లిద్దరే కాదు : యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 17, 2018, 11:09 AM

న్యూఢిల్లీ :  ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఉన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీమ్ ఇండియా స్ఫూర్తికి కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం గండి కొడుతోందని విమర్శించారు. అయినా టీమ్ ఇండియా అంటే మోడీ, అమిత్ షాలు మాత్రమే కాదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో పలు సమస్యలు ఉండే నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం అజెండాలో కేవలం ఆరు అంశాలకే చోటు ఇవ్వడం దారుణమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం, జీఎస్టీ లొసుగులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశంలో గళమెత్తుతారని యనమల చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com