గుంటూరు : వైకాపా అధినేత జగన్ జీవితం ప్రతి శుక్రవారం కోర్టుకు అంకితమైపోయిందని ఆర్టీసి ఛైర్మన్ వర్ల రామయ్య అన్నారు. కేసులనుంచి బైటపడేందుకే జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వైకాపాను కూడా బిజెపి అధ్యక్షుడు అమిత్షా నడిపిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో జగ్జీవన్రాం ప్రధాని కాకుండా కాంగ్రెస్ మోకాలడ్డిందని ఆయన చెప్పారు. దళితుడు ప్రధాని పదవి చేపట్టాలంటే ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యూహంతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.