ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ భద్రత పై బెంగుళూరులో ప్రాంతీయ సదస్సు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 25, 2023, 08:59 AM

జాతీయ భద్రత మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా పై బెంగుళూరు వేదికగా ప్రాంతీయ సదస్సు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌ద‌స్సులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పాల్గొన‌గా, ఏపీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు.  ఏపీ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సదస్సులో సీఎం వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి పాల్గొన్నారు.  ప్ర‌స్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ సదస్సుకు హాజరుకాలేకపోయాన‌ని సీఎం  వైయస్‌.జగన్ పేర్కొన్నారు. అసెంబ్లీలో ద్రవ్యవినిమయబిల్లును ఆమోదించాల్సిన నేపధ్యంలో ఈ సమావేశానికి హాజరుకాలేకపోయాన‌ని, అందుకే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్నాన‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ కేంద్ర మంత్రి అమిత్‌షాకు తెలిపారు. మా ప్రభుత్వం తరపున డీజీపీ ఈ సదస్సుకు హాజరయ్యార‌ని, సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకుంటామ‌ని  సీఎం   వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com