హైదరాబాద్: వాతావరణ ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రజలు సేదతీరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ చేసిన హెచ్చరికతో అదికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణాజిల్లాలోని తిరువురు, గన్నవరం, కైకలూరు, గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ద్వారక తిరుమల, ఏలూరు, భీమవరం ప్రాంతంలో స్వల్ప వర్షం కురిసింది. మాడుగుల, చోడవరం ప్రాంతంలో కుండపోత వర్షం పడింది. తెలంగాణలోని కోదాడ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమైంది.