బెంగళూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మయావతితో భేటీ అయ్యారు. కర్నాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు చంద్రబాబు బెంగళూరు చేరుకున్న సంగతి విదితమే. అక్కడ ఆయన మమత బెనర్జీ, మాయావతి లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ భేటీలలో ఆయన ఏపీ పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి, విభజన హామీలను అమలు చేయని సంగతి చెప్పి ఏపీకి న్యాయం కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు పలకాల్సిందిగా కోరినట్లు సమాచారం.