విజయవాడ: కాలం గతి తప్పుతోంది.. రుతువులు క్రమం తప్పుతున్నాయి.. ప్రకృతితో సహజీవనం చేయడం అలవరచుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ శంకుస్థాపన చేసిన అనంతరం వెంకయ్య మాట్లాడారు. భూమి, నీరు, ఆకాశం, వెలుతురును సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాతీయ ప్రకృతి వైపరీత్యాల నివారణ సంస్థ ఈ ప్రాంత ప్రతిష్ట పెంచనుందన్నారు. ఎన్ఐడీఎం చుట్టుపక్కల చాలా ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటవుతున్నాయని పేర్కొన్నారు. 400 ఎకరాల విస్తీర్ణంలో ఇక్కడ వివిధ సంస్థలు వస్తున్నాయన్నారు.