శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం మాజీ ప్రధాని దేవేగౌడ తిరుమలకు గురువారం రాత్రి వచ్చారు. కుమారుడు రేవణ్ణతో కలిసి హెలికాప్టర్లో తిరుపతి చేరుకుని రహదారి మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. కర్ణాటకలో రాజకీయ పరిణామాల నేపథ్యంలో శ్రీవారిని ప్రార్థించడానికి తిరుమలకు వచ్చినట్లు మాజీ ప్రధాని అనుచరులు తెలిపారు. కుటుంబంలో చీలిక వస్తున్నట్లు జరిగిన ప్రచారం నేపథ్యంలో కుమారుడు రేవణ్ణను వెంట పెట్టుకుని ఇక్కడికి వచ్చారు.