బెంగళూరు: గవర్నర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని జేడీఎస్ నేత కుమారస్వామి ఆరోపించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. మా ఎమ్మెల్యేలందరినీ కాపాడుకోవడమే మా తక్షణ కర్తవ్యమన్నారు. బీజేపీకు మెజార్టీ లేకున్నా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. విపక్ష పార్టీలన్ని ఏకతాటిపై వచ్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జేడీఎస్ నేత కుమారస్వామి పిలుపునిచ్చారు.