ఏలూరు: తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో పడవ ప్రమాద ఘటనలో గల్లంతైన వారిలో బాలుడి మృతదేహం లభ్యమైంది. గోదావరి నీటిపై బాలుడి మృతదేహం తేలింది. సహాయక చర్యల్లో ఉన్న సిబ్బంది బాలుడి మృతదేహాన్ని నది ఒడ్డుకు చేర్చారు. గోదావరి నదిలో గల్లంతైన మృతదేహాల వెలికితీత కొనసాగుతోంది. భారీ క్రేన్ల సహాయంతో సిబ్బంది 40 అడుగుల లోతులో ఉన్న పడవను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.