మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా పింపి మహిపాల్ గ్రామానికి చెందిన శుభాంగీ(22) ఓ యువకుడ్ని ప్రేమించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు మరో వ్యక్తితో వివాహం నిశ్చయించారు. శుభాంగి అతడికి ఫోన్ చేసి ప్రేమ విషయం చెప్పడంతో వివాహం రద్దైంది. దీంతో ఆగ్రహించిన ఆమె తండ్రి, సోదరుడు, బాబాయి ఈ నెల 22న ఆమెను పొలానికి తీసుకెళ్లి తాడు గొంతుకు బిగించి చంపేశారు. అనంతరం మృతదేహానికి నిప్పుపెట్టి అవశేషాలను కాలువలో పడేశారు.