ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల కేంద్రం లో రోడ్డుపై పడి ఉన్న పర్సులోని నగదు, ఏటీఎం కార్డులను శుక్రవారం పోగొట్టుకున్న వ్యక్తికి అందజేసి ఉపాధ్యాయులు నిజాయితీని చాటుకున్నారు. దువ్వూరు మండలం దాసరిపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెండు రోజుల క్రితం నంద్యాలకు పెళ్ళికి వెళుతుండగా చాగలమర్రిలో రూ. 7600 నగదు ఆధార్ కార్డు ఏటీఎం కార్డులతో ఉన్న పర్సు పోగొట్టుకున్నారు. జెడ్పి హై స్కూల్ టీచర్లు, హెచ్ఎం కోటయ్య బాధితున్ని పిలిపించి పర్సును అప్పగించారు. ఈ సందర్భంగా బాధితుడు ఉపాధ్యాయులకు హెచ్ఎం కోటయ్యకు ధన్యవాదాలు తెలియజేశారు.