కేంద్ర ప్రభుత్వం బుధవారం పద్మ అవార్డులను ప్రకటించింది. దివంగత డాక్టర్ దిలీప్ మహలనాబిస్ను పద్మవిభూషణ్ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. డయేరియా నివారణకు ఉపయోగపడే ఓఆర్ఎస్ను ఆయన ఆవిష్కరించారు. మరో 25 మందికి పద్మశ్రీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. బి రామకృష్ణా రెడ్డి (తెలంగాణ), సంకురాతిరి చంద్రశేఖర్ (ఏపీ), మునివెంకటప్ప (కర్ణాటక), హీరాబాయి లోబీ (గుజరాత్)లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి.