లక్నో : కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన రాయ్బరేలీలో పర్యటిస్తున్నారు. గత కొంతకాలంగా అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ నేడు సోనియా అనేక కార్యక్రమాలతో బిజీగా గడుపనున్నారు. నియోజక వర్గం ప్రజలను సోనియా కలుస్తారు. ప్రధాన తపాలా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాస్పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆమె ప్రారంభిస్తారు. అనంతరం నేటి సాయంత్రం తన కుమారుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి సోనియా ఢిల్లికి వెళతారు.