న్యూఢిల్లీ: భగవాన్ బసవేశ్వర జయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బసవేశ్వర విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రధాని ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. భగవాన్ బసవేశ్వర మన చరిత్ర, సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారన్నారు. సాంఘిక సామరస్యం, సోదరభావం, ఐక్యత, కరుణలపై ఆయన ప్రాముఖ్యత మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తుందన్నారు. సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన బసవేశ్వర జ్ఞానానికి ప్రాముఖ్యత ఇచ్చారని కొనియాడారు.