ట్రెండింగ్
Epaper    English    தமிழ்

7 నుంచి 15 వరకు ఉపమాక శ్రీవేంకటేశ్వరాలయాల్లో ఏకాదశి కల్యాణాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:47 AM

  తిరుపతి, మేజర్‌న్యూస్‌  : టిటిడికి అనుబంధంగా ఉన్న విశాఖ జిల్లా ఉపమాకలోని శ్రీవేంకటేశ్వరా లయంలో ఈ నెల 7వ తేది నుంచి 15వ తేది వరకు ఏకాదశి కల్యాణాలు వైభవంగా జరుగను న్నాయి. ఈ నెల 7వ తేది మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లికావాడి ఉత్సవం, సాయం్త్రం 6.30 నుంచి 9.30 గంటల వరకు విష్వక్సేన ఆరాధన, పుణ్యావాచనం, రుత్విక్వరుణ, మృత్సుంగ్రహణము నిర్వహించనున్నారు. రాత్రి 9.45 నుంచి 11 గంటల వరకు స్వామి వారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారుజామున 12.10 నుంచి 1.45 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈనెల 8వ తేది బుధవారం 12.20 నుంచి 1.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు పల్లకి ఉత్సవం ఘనంగా జరుగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 3 గంటల వరకు ధ్వజారోహణంతో కల్యాణోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి 11 గంటల నుంచి 12.30 గంటల వరకు రథోత్సవం, తెల్లవారుజామున 12.45 గంటల నుంచి 2.45 గంటల వరకు శ్రీవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. 


  ఈ నెల 9వ తేది గురువారం రాత్రి 8.30 నుంచి 9.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారు హంస వాహనంపై, మార్చి 10వ తేది శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి 11.30 గంటల వరకు శ్రీభూసమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారు పుణ్యకోటి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ నెల 11వ తేది శనివారం సాయం్త్రం 3.30 నుంచి 6.30 గంటల వరకు తోట ఉత్సవం, రాత్రి 8.30 నుంచి 9.45 గంటల వరకు ఉభయ నాంచారులతో శ్రీవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 12వ తేది సాయం్త్రం 3 నుంచి రాత్రి 7.30 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 12.30 గంటల వరకు రథోత్సవం వైభవంగా జరుగనుంది. 13వ తేది ఉదయం 3.30 నుంచి 4.45 గంటల వరకు పుష్పయాగోత్సవం, సాయం్త్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు ధ్వజ అవరోహణం, 14, 15వ తేదిల్లో రాత్రి 8 ఉంచి 9 గంటల వరకు పవలింపు సేవ నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com