కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్ లో దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ వంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు. అడ్డు వచ్చిన శ్రీదేవిని గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న 70 కాసులు బంగారం .4 లక్షల నగదు ఆపహారించారు. మృతురాలి కుటుంబసభ్యులు తెల్లవారు జామున వచ్చి చూసే సరికి శ్రీదేవి మృతదేహం కనిపించింది. వెంటనే వారు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు.