న్యూఢిల్లీ : ఏపీకి ఇచ్చిన హామీలు వేటినీ కేంద్రం ఇంత వరకూ నెరవేర్చలేదని తెలుగుదేశం ఎంపీ సీఎం రమేష్ అన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లయినా ఇంత వరకూ విభజన హామీలేవీ నెరవేరలేదన్నారు. కేంద్రం తీరు ఎంతమాత్రం బాగాలేదని ఆయన పేర్కొన్నారు. విభజన హామీలు నెరవేరేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని సీఎం రమేష్ అన్నారు.