తిరుపతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. చంద్రబాబు మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు మంగళవారం సాయంత్రమే కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తిరుమలకు విచ్చేశారు. బుధవారం ఉదయం శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తన మనుమడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబునాయుడు తిరుమల అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 26లక్షలను విరాళంగా ఇచ్చారు.