న్యూఢిల్లి : కేంద్ర ప్రభుత్వంపై వైకాపా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై అన్ని విపక్షాలతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. వైకాపా ప్రవేశపెట్టే అవిశ్వాసం మొక్కుబడిగా కనిపిస్తోందని ఆయన విమర్శించారు. పార్లమెంటు లాబీలో తాను ఎదురుపడినప్పుడు మాత్రమే మద్దతు కోరారని, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ ఛైర్పర్సన్ సోనియా గాంధీలను ఎందుకు కలిసి మద్దతు కోరలేదని ఆయన ప్రశ్నించారు. అన్ని ప్రతిపక్ష పారట్లను సమన్వయం చేసుకుంటేనే ఫలితం ఉంటుందని ఆయన చెప్పారు.