ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ వేదికపై బ్రిటన్ ప్రధాని కూతురి కూచిపూడి ప్రదర్శన

international |  Suryaa Desk  | Published : Sun, Nov 27, 2022, 12:14 AM

బ్రిటన్ కు నూతన ప్ఱధానిగా ఎన్నికతో రుషి సునాక్ భారతీయులకు మరింత సుపరిచితం అయ్యారు. ఇదిలావుంటే యూకే ప్రధాన మంత్రి రిషీ సునాక్ కూతురు అనౌష్క సునాక్ అంతర్జాతీయ వేదికపై కూచిపూడి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లండన్ లో జరుగుతున్న అంతర్జాతీయ కూచిపూడి డ్యాన్స్ వేడుకల్లో అనౌష్క పాల్గొన్నారు. తొమ్మిది సంవత్సరాల వయసున్న అనౌష్క కొంతకాలంగా కూచిపూడి నేర్చుకుంటున్నట్లు సమాచారం. తాజాగా లండన్ లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 100 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 


నాలుగేళ్ల చిన్నారి నుంచి 85 ఏళ్ల వయసున్న వారు కూడా ఈ డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంగవైకల్యంతో బాధపడుతున్న ఓ యువతి వీల్ చెయిర్ లోనే డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. యూకే ప్రధాని పదవిని అధిరోహించిన తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ చరిత్ర సృష్టించారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తిని సునాక్ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కృష్ణ సునాక్, అనౌష్క సునాక్.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com