ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంక్కు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఎగ్గొట్టిన రుణం ముందుగా అంచనా వేసిన దానికంటే ఎక్కువే ఉన్నట్లు ఆ బ్యాంక్ వెల్లడించింది. నీరవ్ మోదీ నిర్వహించిన మోసపూరిత లావాదేవీల మొత్తం సుమారు 1300 కోట్లు ఉంటుందని పీఎన్బీ బ్యాంక్ తాజాగా స్పష్టం చేసింది. నిన్నటి వరకు నీరవ్ మోదీ.. ఆ బ్యాంక్కు సుమారు 11400 కోట్ల మేరకు మాత్రమే ఎగవేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తం మరింత పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. నీరవ్ మోదీ చేసిన అక్రమ లావాదేవీల మొత్తం 1300 కోట్లు ఉంటుందని సోమవారం రాత్రి పంజాబ్ బ్యాంక్.. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్కు తెలియజేసింది. అయితే తాజా ఎక్స్చేంజ్ రేటు ప్రకారం ఆ విలువ సుమారు 1323 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.