తిరుపతి నగరంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో వరుసగా రూ.12 కోట్లతో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, రూ. 4.5 కోట్లతో వ్యవసాయ కళాశాల బాలికల వసతి గృహ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆహార భద్రత కోసం జరుగుతున్న జాతీయ స్థాయి సెమినార్ ముగింపు సమావేశానికి హాజరై అనంతరం లిక్విడ్ బయో ఫెర్టిలైజర్ యూనిట్ ప్రారంభించనున్నారు. చివరగా కిసాన్ మేళాలో పాల్గని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారు.