నీరవ్ మోడీ వ్యవహారంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు మరో ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. దీంతో ఈ వ్యవహారంలో ఇప్పటి వరకూ సస్పెండైన పీఎన్ బీ ఉద్యోగుల సంఖ్య పద్దెనిమిదికి చేరుకుంది. నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల టోపీ పెట్టి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఏ స్థాయిలో అవకతవకలు జరిగాయన్న దానిపై పంజాబ్ నేషనల్ బ్యాంకు అంతర్గత విచారణ కొనసాగుతున్నది.