నెల్లూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 88వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 88వ రోజు పాదయాత్రను జంగాలపల్లి నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ఆదిమూర్తిపురం, తూర్పు యర్రబల్లిక్రాస్, కొండాపురం, రేనమాల మీదుగా తూర్పుపాలెం క్రాస్ వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా కొండాపురంలో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. రేనమాలలో మహిళలతో జగన్ ముఖాముఖి నిర్వహించనున్నారు.