వచ్చే నెల 1 నుంచి థియోటర్లు బంద్ చేయాలని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది. గత కొంతకాలం నుంచి సర్వీస్ ప్రొవైడర్ల కారణంగా సినిమా పరిశ్రమ నష్టపోతుందని, వారికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకునే పరిస్థితిలో లేరని, తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా ప్రదర్శనలను నిలిపివేస్తున్నట్టు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు పి.కిరణ్, కార్యదర్శి దామూ కానూరి, తమిళ నటీనటుల సమాఖ్య అధ్యక్షుడు విశాల్, కార్యదర్శి కదిరేషు, దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఎల్. సురేష్, కార్యదర్శి రవి కొట్టార్కర్ ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్ష కార్యదర్శులు, కేరళ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్ష కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంలో మార్చి 1 నుంచి ఏ సినిమాలు విడుదల చేయడం లేదని వారు స్పష్టం చేశారు.