ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహించారు. కూంబింగ్లో భాగంగా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకున్నారు. ఘటనాస్థలిలో మావోయిస్టులకు చెందిన సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పైపు, బాటిల్ బాంబులతో పాటు సెల్ఫోన్, వైర్లు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.