ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల గుంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 07, 2022, 04:43 PM

చిత్తూరు జిల్లా పలమనేరు రేంజ్ పరిధిలోని కీలపట్ల గ్రామంలో రాత్రివేళల్లో ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తూ రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇటీవల పలమనేరు పరిసరప్రాంతాల్లో ఏనుగులగుంపు వరుసగా దాడులు చేసి, మనుషుల ప్రాణాలు సైతం తీశాయి. ఈ విషయమై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన లాభం లేకపోయింది అంటూ మీడియా ముందు వాపోయారు. ఒకవైపు పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు ఈ వరుస గజ దాడులతో కోలుకోలేక పోతున్నామని ఆత్మహత్యే మాకు శరణ్యమని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఏనుగుల గుంపులను అరికట్టి రైతులను ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com