గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం ఈనెల 30 వ తేదీన బి. కొత్తకోట జడ్పీ హైస్కూల్ లో ఎంపీ మిథున్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ల ఆధ్వర్యంలో, 40 కంపెనీ లకు మెగా జాబ్ మేళా' ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎం పీ, ఓ ఎన్ డి, మాజీ సీఈవో దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. ములకలచెరువు ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా ప్రతినిధులు, మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ. వాలెంటర్ పరిధిలో ఉన్న నిరుద్యోగుల జాబితా నమోదు చేసుకొని,. ఆ తర్వాత సచివాలయం పరిధిలో సర్పంచ్, ఎంపీటీసీ, కార్యదర్శి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించిన నిరుద్యోగ వివరాలు తెలుస్తుందని అన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో వేల సంఖ్యలో నిరుద్యోగ యువకులు ఉన్నట్లు గణాంకాలు ఉన్నాయని, అందువల్ల నమోదు చేసుకున్న నిరుద్యోగుల మెగా జాబ్ మేళా తీసుకు పోవాలని, ములకలచెరువు ఎంపీడీవో రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాయి లీల ఉమామహేశ్వరరావు, జెడ్పిటిసి మోహన్ రెడ్డి, ఎమ్మార్వో శ్రీనివాసులు, హౌసింగ్ అధికారులు, సంబంధిత మండల శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వాల్ ఎంట్రీలు, తదితరులు పాల్గొన్నారు.