ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఖచ్చితంగా ప్రతి ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాల్సిందే: సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 13, 2022, 05:31 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. కేబినెట్ భేటీ అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌. ప్రజలకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలని ఆదేశించారు. అలాగే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా ప్రతీ ఇంటికి మంత్రి, ఎమ్మెల్యే వెళ్లాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను వివరిస్తే తక్షణమే పరిష‍్కరించాలని స్పష్టం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com