ఇండియాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 30,773 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా నుంచి 38,945 మంది కోలుకోగా 309 మంది కరోనాతో చనిపోయారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,34,48,163 కు చేరింది. ఇప్పటివరకు వరకు మొత్తం 3,26,71,167 మంది కరోనా నుంచి కోలుకోగా 4,44,838 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో 3,32,158 యాక్టీవ్ కేసులున్నాయి.