విశాఖపట్నం: పేద ప్రజల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి... సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైఎస్ఆర్ అని మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. గురువారం వైసీపీ ఆఫీసులో నిర్వహించిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ చరిత్రలో వైఎస్ చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు. అభివృద్ధిలో వైఎస్ 4 అడుగులు ముందుకు వేస్తే..జగన్ 10 అడుగులు ముందుకు వేస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు.