ఛత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. తమ చరలో బంధీగా ఉన్న ఎస్ఐ మురళీ తాతీని హత్య చేశారు. పల్సమ్ సమీపంలో మురళీ డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు. ఈ నెల 21న ఎస్ఐ మురళిని మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి ఎస్ఐ విడుదల కోసం గోండ్వానా సమాజ్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది. ఓ వైపు చర్చలు జరుపుతుండగానే మురళీని హత్య చేశారు.