కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు, పల్లెల్లో, పారిశుధ్య నిర్వహణను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఉపాధి హామీ పనుల్లో మార్పులను తీసుకువచ్చింది. ఈ నిర్ణయంతో పల్లెలన్నీ పారిశుధ్యంలో మెరుగుకానున్నాయి. ఇప్పటికే ఉపాధి హామీ పనుల జాబితాలోకి వ్యవసాయ పనులను చేర్చిన విషయం తెలిసిందే. తాజాగా పారిశుద్ధ్య సంబంధం పనులను చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఇక నుంచి ఈ పథకం కింద చేసేందుకు అనుమతులు ఇచ్చింది.