ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో 4,40,215కి చేరిన బాధితులు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 24, 2020, 08:52 AM

భారత్‌లో రోజూ దాదాపు 15 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,933 కేసులు వెలుగులోకి వచ్చాయి. 312 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం నాటికి దేశంలో మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 4,40,215కి చేరింది. ఇక ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య 14,011గా నమోదుకాగా, కోలుకొని ఇళ్లకు చేరిన వారి సంఖ్య 2,48,189కు చేరింది. దీంతో రికవరీ రేటు ఆశాజనకంగా మారింది. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 1,78,014 ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర 1,35,796 తొలిస్థానంలో ఉండగా, తర్వాత దిల్లీ 62,655, తమిళనాడు 62,087 ఉన్నాయి. మరోవైపు తెలంగాణలో నిన్న ఒక్కరోజే 872 కొత్త కేసులు నమోదయ్యాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com