దేశంలో కరోనా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి భారతీయ రైల్వే తీవ్రంగా కృషి చేస్తోంది. రైళ్లను ఆస్పత్రులుగా మార్చి సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు ఎన్ని ఐసోలేషన్ బెడ్స్ రెడీ అయ్యాయో, రైల్వే ఆస్పత్రులు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. నాన్ ఏసీ రైలు కోచ్లను ఆస్పత్రులుగా మారుస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభించి ఆస్పత్రుల్లోని బెడ్స్ సరిపోని పరిస్థితి వస్తే ఈ రైళ్లనే ఆస్పత్రులుగా వాడుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లివి.
2. ఏప్రిల్ 30 నాటికి 4,00,000 బెడ్స్ సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది భారత ప్రభుత్వం. అందులో భాగంగా రైల్వే కోచ్లను ఆస్పత్రులుగా మారుస్తోంది.
3. భారతీయ రైల్వేకు చెందిన ఐదు జోన్లు నాన్ ఏసీ ట్రైన్ కోచ్లను ఆస్పత్రులుగామార్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నం ఫలించడంతో సోమవారం నాటికి 2,500 కోచ్లను ఐసోలేషన్ వార్డులుగా మార్చేసింది. అంటే 40,000 ఐసోలేషన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయి.
4. ఇంకొన్ని రోజుల్లో 5,000 నాన్ ఏసీ కోచ్లను ఐసోలేషన్ బెడ్స్గా మార్చాలని రైల్వే టార్గెట్గా పెట్టుకుంది. అంటే 80,000 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధంగా ఉంటాయి.
5. అవసరాన్ని బట్టి 20,000 కోచ్లను 3,20,000 ఐసోలేషన్ బెడ్స్గా మార్చాలని నిర్ణయించింది భారతీయ రైల్వే. వాటిని భారతదేశంలో 16 రైల్వే జోన్లకు అవసరాన్ని బట్టి తరలిస్తుంది.
6. భారతీయ రైల్వే ఆస్పత్రులుగా మార్చిన కోచ్లు అత్యధికంగా తెలంగాణకు కేటాయించడం విశేషం. తెలంగాణలోని సికింద్రాబాద్ హెడ్క్వార్టర్గా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 486 కోచ్లు అంటే 7,776 ఐసోలేషన్ బెడ్స్ కేటాయించనుంది రైల్వే.