ఢిల్లీ ఘర్షణలపై అర్ధరాత్రి హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ చీఫ్ తో అమిత్ షా భేటీ అయ్యారు. హోం మంత్రి అమిత్ షా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ పూర్తిగా పోలిసుల అధీనంలో ఉంది. జాఫ్రాబాద్, మౌజ్ పూర్ ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి. ట్రంప్ పర్యటిస్తున్న కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. రాజ్ ఘాట్ కు ట్రంప్ వెళ్లే మార్గంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఢిల్లీ అల్లర్లపై హోంమంత్రిత్వశాఖకు ఢిల్లీ పోలీసులు నివేదిక ఇచ్చారు. ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేశారు.