తలకు గాయమై ప్రయివేట్ ఆస్పత్రిలో డిసెంబర్ 1 నుంచి చికిత్స పొందుతున్న మాజీ కేంద్రమంత్రి అరుణ్శౌరి కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, స్పృహలో ఉన్నారని, మరో రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిస్చార్జి అవుతారని ఆస్పత్రి సీనియర్ అధికారి చెప్పారు. ఆదివారం సాయంత్రం ప్రధాని మోడీ శౌరీని ఆస్పత్రిలో కలసి పరామర్శించారు.