బిజెపి నేత ఫడ్నవిస్ను కలుసుకున్న సందర్భంగా ఎన్సిపి నేత అజిత్ పవార్ సోమవారం మీడియాతో మాట్లాడారు. పవార్ మిత్రత్వంతో ఫడ్నవిస్ రెండోసారి అత్యల్ప స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ఆదివారం ఈ ఇద్దరు నేతలూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే సంజయ్ షిండే కూతురు పెళ్లి సందర్భంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు ముచ్చటించుకున్నారు. దీనిపై అనేక రకాలుగా ఊహాగానాలు చెలరేగాయి. అయితే తమ మధ్య మాటలలో విశేషమేమీ లేదని, వాతావరణం, వర్షాల గురించి ముచ్చటించుకున్నామని, పక్కపక్కనే కూర్చున్నందున ఏదో ఒకటి మాట్లాడుకోవల్సి ఉంటుంది కదా అని అన్నారు. ఏదో కొత్త వంటకం జరుగుతుందనే ఊహాగానాలకు దిగవద్దని విలేకరులతో చమత్కరించారు.