ప్రకాశం జిల్లా గిద్దలూరులో అధ్వానకరంగా గురుకుల పాఠశాల తయారైంది. ప్రభుత్వ ఎస్టి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు దుప్పట్లు, మంచాలు లేవు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు నేలపైనే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యార్థులలో కొంతమందికి మాత్రమే దుప్పట్లను అందించడం వల్ల మిగిలిని వారు తీవ్ర అసహనానికి గురువుతున్నారు. అంతేకాకుండా ఆహారం కూడా మెనూ ప్రకారం విద్యార్థులకు ఇవ్వడం లేదు. నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు పెడుతున్నారు. చలికాలం కావడంతో విద్యార్థులు చలికి వణికిపోతూ ఇబ్బందుల పాలవుతున్నారు. ప్రభుత్వం మంచాలు, దుప్పట్లు సరఫరా చేసినా వాటిని విద్యార్థులకు పంపిణీ చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గురుకుల పాఠశాల విద్యార్థులకు నరకప్రాయంగా మారింది. నాణ్యత లేని ఆహారం తినడం వల్ల విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారు. చలికాలం కావడంతో రాత్రి పూట చలికి వణుకుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకనైనా అధికారులు గురుకుల పాఠశాల సమస్యలను పట్టించుకుని తమకు న్యాయం చేయాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకొంటున్నారు.